జాతీయ గీతాన్ని ఆలపించడంపై నిషేధం

- August 09, 2016 , by Maagulf
జాతీయ గీతాన్ని ఆలపించడంపై నిషేధం

అత్యంత భక్తిశ్రద్ధలతో పాడుకోవాల్సిన జాతీయ గీతాన్ని ఆలపించడంపై నిషేధం విధించిన పాఠశాలను అధికారులు మూసేశారు. ఆ పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించబోతున్నారు. జాతీయ గీతాన్ని పాడకూడదని ఎంఏ కాన్వెంట్ స్కూల్ మేనేజర్ జియా ఉల్ హక్ ఆదేశించారు. అందులోని 'భారత భాగ్యవిధాత' అనే పదాలు ఇస్లాంకు వ్యతిరేకమని జియా చెప్పారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. రెండు దశాబ్దాలుగా ఎటువంటి అధికారిక అనుబంధం లేకుండా ఈ పాఠశాల ఎలా నడుస్తోందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ గీతాన్ని పాడకూడదని నిషేధం విధించడంపై ఆ పాఠశాలలోని 8 మంది టీచర్లు రాజీనామా చేయడంతో ఈ స్కూలు వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. వివిధ రంగాలకు చెందినవారు స్కూలు యాజమాన్యం జాతీయ గీతాన్ని నిషేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరం రుజువైతే మూడేళ్ళ వరకు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com