నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!

- June 26, 2026 , by Maagulf
నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!

దోహా: రాస్ లఫాన్ ఘటనలో మరణించిన 12 మంది భారతీయులలో నలుగురి మృతదేహాలను భారత్ కు తరలించినట్లు ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మిగిలిన ఎనిమిది మంది మృతదేహాలను కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియలో మృతుల కుటుంబాలకు మరియు సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు  రాయబార కార్యాలయం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com