కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- June 26, 2026
కువైట్: కువైట్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిరంతరం తనిఖీలు, కఠిన చర్యల కారణంగానే కేసుల సంఖ్య తగ్గుతుందని కువైట్ న్యాయశాఖ మంత్రి, కౌన్సిలర్ నాసర్ అల్-సుమైత్ అన్నారు. మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టాన్ని తిరిగి రూపొందించి, సమీక్షించడానికి కౌన్సిలర్ మహమ్మద్ అల్-దువాజ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీని ఫలితంగా, అక్రమ రవాణాదారులకు విధించే శిక్షలను కఠినతరం అవుతుందన్నారు. రసాయన సమ్మేళనాలను ఉపయోగించి తక్కువ ఉత్పత్తి వ్యయంతో మరియు సులభంగా తయారు చేయగలగడం వల్ల సైకోట్రోపిక్ పదార్థాలు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారాయని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన సవరణలు
సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాకు విధించే శిక్షలను గణనీయంగా పెంచారు. గత చట్టం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగా, సవరించిన ఈ చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరణశిక్షను కూడా అనుమతిస్తుంది. అల్-సుమైత్ ప్రకారం, ఈ కఠినమైన చట్టం ప్రభావం కేవలం మూడు నెలల్లోనే స్పష్టంగా కనిపించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరాలు 44 శాతం తగ్గాయి.అధికారుల కృషి ఫలితంగా కువైట్లో కొన్ని రకాల మాదకద్రవ్యాల చలామణి 80 శాతం తగ్గిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







