కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- June 26, 2026
కువైట్: కువైట్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిరంతరం తనిఖీలు, కఠిన చర్యల కారణంగానే కేసుల సంఖ్య తగ్గుతుందని కువైట్ న్యాయశాఖ మంత్రి, కౌన్సిలర్ నాసర్ అల్-సుమైత్ అన్నారు. మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టాన్ని తిరిగి రూపొందించి, సమీక్షించడానికి కౌన్సిలర్ మహమ్మద్ అల్-దువాజ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీని ఫలితంగా, అక్రమ రవాణాదారులకు విధించే శిక్షలను కఠినతరం అవుతుందన్నారు. రసాయన సమ్మేళనాలను ఉపయోగించి తక్కువ ఉత్పత్తి వ్యయంతో మరియు సులభంగా తయారు చేయగలగడం వల్ల సైకోట్రోపిక్ పదార్థాలు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారాయని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన సవరణలు
సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాకు విధించే శిక్షలను గణనీయంగా పెంచారు. గత చట్టం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగా, సవరించిన ఈ చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరణశిక్షను కూడా అనుమతిస్తుంది. అల్-సుమైత్ ప్రకారం, ఈ కఠినమైన చట్టం ప్రభావం కేవలం మూడు నెలల్లోనే స్పష్టంగా కనిపించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరాలు 44 శాతం తగ్గాయి.అధికారుల కృషి ఫలితంగా కువైట్లో కొన్ని రకాల మాదకద్రవ్యాల చలామణి 80 శాతం తగ్గిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబి మాల్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సందర్శన
- జెన్జీ ఎఫెక్ట్తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
- సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- కువైట్లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్లో ప్రత్యేక శిక్షణ..!!
- ఒమన్లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్పోర్ట్’ సర్వీస్..!!
- 183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- డీప్ఫేక్లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్







