సౌదీలో ప్రమాదం.. జోగాపూర్‌వాసి మృతి

- August 12, 2016 , by Maagulf
సౌదీలో ప్రమాదం.. జోగాపూర్‌వాసి మృతి

చందుర్తి: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వలసవెళ్లిన కరీంనగర్ జిల్లావాసి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చందుర్తి మండలంలోని జోగాపూర్ అనుబంధ గ్రామం గుడిపేటకు చెందిన గరిడే శంకర్(47) రూ.2 లక్షల వరకు అప్పుచేసి ఉపాధి కోసం సౌదీ అరేబి యాకు వెళ్లాడు. గత శుక్రవారం పని నిమిత్తం బయటికెళ్లిన శంకర్‌ను, కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన ఎన్నారైలు చికిత్స కోసం శంకర్‌ను దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ఆరు రోజులుగా చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం శంకర్ మృతిచెందినట్లు సమాచారం అందింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com