సౌదీలో ప్రమాదం.. జోగాపూర్వాసి మృతి
- August 12, 2016
చందుర్తి: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వలసవెళ్లిన కరీంనగర్ జిల్లావాసి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చందుర్తి మండలంలోని జోగాపూర్ అనుబంధ గ్రామం గుడిపేటకు చెందిన గరిడే శంకర్(47) రూ.2 లక్షల వరకు అప్పుచేసి ఉపాధి కోసం సౌదీ అరేబి యాకు వెళ్లాడు. గత శుక్రవారం పని నిమిత్తం బయటికెళ్లిన శంకర్ను, కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన ఎన్నారైలు చికిత్స కోసం శంకర్ను దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ఆరు రోజులుగా చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం శంకర్ మృతిచెందినట్లు సమాచారం అందింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్బాబు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









