సౌదీలో ప్రమాదం.. జోగాపూర్వాసి మృతి
- August 12, 2016చందుర్తి: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వలసవెళ్లిన కరీంనగర్ జిల్లావాసి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చందుర్తి మండలంలోని జోగాపూర్ అనుబంధ గ్రామం గుడిపేటకు చెందిన గరిడే శంకర్(47) రూ.2 లక్షల వరకు అప్పుచేసి ఉపాధి కోసం సౌదీ అరేబి యాకు వెళ్లాడు. గత శుక్రవారం పని నిమిత్తం బయటికెళ్లిన శంకర్ను, కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన ఎన్నారైలు చికిత్స కోసం శంకర్ను దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ఆరు రోజులుగా చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం శంకర్ మృతిచెందినట్లు సమాచారం అందింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్బాబు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..