అరెస్టయిన భారతీయుడికి ఇండియన్ ఎంబసీ సాయం
- August 12, 2016
అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, ఫోర్జరీ కేసులో అరెస్టయిన భారతీయుడి కేసులో అతనికి సహాయ పడేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ విషయంలో తమకు తగిన సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు బాధితుడి 16 ఏళ్ళ కుమార్తె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అబుదాబీలోని గల్ఫ్ బేస్డ్ బ్యాంక్లో తన తండ్రి పనిచేస్తున్నారని ఆమె వివరించింది. ఫోర్జరీ కేసులో జులై 19న ఆయన అరెస్టయ్యారు. ఉచితంగా లీగల్ కౌన్సిలింగ్ని లీగల్ కౌన్సెలర్స్ ద్వారా ఇవ్వగలుగుతామని ఎంబసీ అధికారులు ఆ కుటుంబానికి సమాచారమిచ్చారు. యూఏఈ అథారిటీస్తో ఈ విషయమై చర్చించినట్లు కౌన్సెలర్ దినేష్ కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆ బాలిక, తన తల్లి గృహిణి అనీ ఇటీవలే జైల్లో తన తండ్రిని కలిసి వచ్చారని చెప్పింది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







