ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారిని పరామర్శించిన రామ్
- August 12, 2016
విశాఖలో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఐదేళ్ల చిన్నారి కుందన పూర్ణ చంద్రికను సినీనటుడు రామ్ పరామర్శించారు. ఎంవీపీ కాలనీ సెక్టార్-3లోని కుందన ఇంటికి వచ్చి చిన్నారితో కాసేపు గడిపారు. కుందన త్వరగా కోలుకొని, సంతోషంగా తిరగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రామ్ అంటే కుందనకు ఎంతో అభిమానమని.. రామ్ను చూడాలన్న ఆమె కోరిక నెరవేరడంతో ఎంతో సంతోషంగా ఉందని కుందన తల్లిదండ్రులు తెలిపారు.
కుందన పుట్టినప్పట్నుంచి నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. కాళ్లు కదపలేని పరిస్థితులో ఉన్న ఆమెను తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంతోనే తన అభిమాని పూర్ణ చంద్రిక కోరిక తెలుసుకోగల్గానని ఈ సందర్భంగా రామ్ అన్నారు.
సుమారు 15 నిమిషాల పాటు చిన్నారితో గడిపిన రామ్ శనివారం భోజనానికి రావాలని కుందన కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. ఆయన వెంట బీజేవైఎం రాష్ట్ర ప్రతినిధి దామోదర యాదవ్, హైపర్ చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









