భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- July 08, 2026
పశ్చిమాసియాలో అమెరికా (US), ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారతదేశానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలోని ఒమన్ కారిడార్ మార్గంలో ప్రయాణిస్తూ, భారత్కు వస్తున్న ఒక క్రూడాయిల్ (కడి చమురు) నౌకను ఇరాన్కు చెందిన శక్తివంతమైన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) బలగాలు అడ్డుకుని వెనక్కి పంపించివేశాయి. అమెరికా నిర్దేశించిన లేదా సూచించిన సముద్ర కారిడార్ల గుండా ప్రయాణించడానికి వీల్లేదని, తాము నిర్దేశించిన మార్గాల్లోనే నౌకలు వెళ్లాలని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. ఈ పరిణామంతో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సరఫరా మార్గంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్కు చేరాయి.
హార్ముజ్ జలసంధి పై ఆధిపత్య పోరు..భారత్కు పెరగనున్న చమురు తలనొప్పి!
వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు మరోసారి ‘ఢీ అంటే ఢీ’ అనేలా తలపడుతున్నాయి. ఈ రెండు అగ్ర దేశాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఇప్పుడు నేరుగా భారత ఇంధన భద్రతపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. భారతదేశం తన అవసరాలకు సరిపడా ముడి చమురును అత్యధికంగా గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది, వీటన్నింటికీ హార్ముజ్ జలసంధే ప్రధాన మార్గం. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో చమురు రవాణా ఆలస్యం కావడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, భారత్లో ఇంధన ధరలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ తాజా సంక్షోభం భారత దౌత్య, ఆర్థిక వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారింది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







