యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- July 08, 2026
హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేవస్థానం పరిపాలనపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులతో జరిగిన ఈ సమావేశంలో దేవస్థానం భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి ప్రణాళికలు, పారదర్శక పాలన, భక్తులకు నాణ్యమైన సేవలు అందించే అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.
సమావేశంలో దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి, బోర్డు సభ్యులు వినోద్ వెంకటస్వామి (ఎమ్మెల్యే), కొణిదెల సురేఖ, విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డా. మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం. రాఘవేందర్ రావు, డా. లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భక్తులకు అన్ని విధాలుగా మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పాలక మండలికి సూచించారు. ఆలయ ప్రతిష్ఠకు అనుగుణంగా పరిపాలనలో పారదర్శకత, సేవాభావం, సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
యాదగిరిగుట్టను దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడంలో పాలక మండలి సమిష్టిగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







