షారూఖ్ ఖాన్ వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సిందని శివసేన
- August 13, 2016
అమెరికాలో చేదు అనుభవం ఎదుర్కొన్న బాలీవుడు అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సిందని శివసేన పేర్కొంది. దేశభక్తిని చూపించి స్వదేశానికి తిరిగి వచ్చుంటే అమెరికాను చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉండేదని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన అభిప్రాయపడింది. ఏడేళ్లలో షారూఖ్ ఖాన్ ను అమెరికా విమానాశ్రయాల్లో మూడుసార్లు నిర్బంధించారని తెలిపింది. లాస్ ఏంజెలెజ్ ఎయిర్ పోర్టులో షారూఖ్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.దీనిపై శివసేన స్పందిస్తూ... అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో షారూఖ్ ను నిర్బంధించడం సాధారణ విషయంగా మారిందని, అవమానాలు ఎదురవుతున్నా అగ్రదేశానికి వెళ్లడం ఆయన మానలేదని ఆక్షేపించింది. 'ఈవిధంగా నన్ను అవమానిస్తే ఇక మీ దేశంలో అడుగు పెట్టను' అని షారూఖ్ స్వదేశానికి తిరిగి వచ్చేసివుంటే అమెరికా ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉండేదని శివసేన పేర్కొంది. ప్రతి ముస్లింను తీవ్రవాదిగా అమెరికా భావిస్తోందని విమర్శించింది. కశ్మీర్ యువత పెడదోవ పట్టకుండా దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని షారూఖ్ ఖాన్ కు శివసేన సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









