బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- July 13, 2026
మనామా: బహ్రెయిన్లో సోమవారం తెల్లవారుజామున అత్యవసర సైరన్లను మోగించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులు, నివాసితులంతా ప్రశాంతంగా ఉండి సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్లాలని సూచించింది.
ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. "సైరన్ మోగించబడింది. పౌరులు, నివాసితులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అధికారిక వర్గాలు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
అయితే, సైరన్లు మోగించడానికి గల కారణంపై అధికారులు వెంటనే ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







