బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన

- July 13, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన

మనామా: బహ్రెయిన్‌లో సోమవారం తెల్లవారుజామున అత్యవసర సైరన్లను మోగించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులు, నివాసితులంతా ప్రశాంతంగా ఉండి సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్లాలని సూచించింది.

ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. "సైరన్ మోగించబడింది. పౌరులు, నివాసితులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అధికారిక వర్గాలు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

అయితే, సైరన్లు మోగించడానికి గల కారణంపై అధికారులు వెంటనే ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com