బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- July 13, 2026
మనామా: బహ్రెయిన్లో సోమవారం తెల్లవారుజామున అత్యవసర సైరన్లను మోగించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులు, నివాసితులంతా ప్రశాంతంగా ఉండి సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్లాలని సూచించింది.
ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. "సైరన్ మోగించబడింది. పౌరులు, నివాసితులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అధికారిక వర్గాలు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
అయితే, సైరన్లు మోగించడానికి గల కారణంపై అధికారులు వెంటనే ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







