బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్‌

- July 13, 2026 , by Maagulf
బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్‌

కువైట్ సిటీ: కువైట్‌పై ఆదివారం జరిగిన దాడుల్లో దేశ ఉత్తర సరిహద్దులోని మూడు భూ సరిహద్దు పోస్టులు, కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన సముద్రంలోని చమురు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫామ్ దెబ్బతిన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు గాయపడగా, అతనికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రకారం, కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన శత్రువుల వైమానిక లక్ష్యాలను సైన్యం విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసిందన్నారు. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం పూర్తిస్థాయి అప్రమత్తతతో సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

మరోవైపు, కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇవి కువైట్ భద్రత, పౌరులు, ప్రవాసుల రక్షణకు ప్రత్యక్ష ముప్పుగా అభివర్ణించింది. అదేవిధంగా బహ్రెయిన్, ఒమన్, ఖతార్, జోర్డాన్‌లపై జరిగిన దాడులను కూడా కువైట్ ఖండించింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని చర్యలను వెంటనే నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com