బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- July 13, 2026
కువైట్ సిటీ: కువైట్పై ఆదివారం జరిగిన దాడుల్లో దేశ ఉత్తర సరిహద్దులోని మూడు భూ సరిహద్దు పోస్టులు, కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన సముద్రంలోని చమురు డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ దెబ్బతిన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు గాయపడగా, అతనికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రకారం, కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన శత్రువుల వైమానిక లక్ష్యాలను సైన్యం విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసిందన్నారు. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం పూర్తిస్థాయి అప్రమత్తతతో సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
మరోవైపు, కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇవి కువైట్ భద్రత, పౌరులు, ప్రవాసుల రక్షణకు ప్రత్యక్ష ముప్పుగా అభివర్ణించింది. అదేవిధంగా బహ్రెయిన్, ఒమన్, ఖతార్, జోర్డాన్లపై జరిగిన దాడులను కూడా కువైట్ ఖండించింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని చర్యలను వెంటనే నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







