సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- July 15, 2026
దుబాయ్: ప్రపంచ ప్రసిద్ధ దుబాయ్ 'మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్' (Museum of the Future) ప్రస్తుత ప్రదర్శన (Exhibition) ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగియనుంది. ఈ మేరకు మ్యూజియం యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. 2027లో ఆవిష్కరించబోయే "నెక్స్ట్ జనరేషన్" సరికొత్త ప్రదర్శనల కోసం పనులు ప్రారంభించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు పంపిన వినూత్న ఆలోచనలు, సూచనల ఆధారంగా ఈ భవిష్యత్తు ప్రదర్శనలను రూపొందించనున్నారు.
మ్యూజియం తదుపరి తరం ఇంటరాక్టివ్ అనుభవాలను తీర్చిదిద్దేందుకు గాను సాధారణ ప్రజల నుండి సలహాలను ఆహ్వానిస్తూ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి స్పందనగా మ్యూజియం సాషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా 1,000కి పైగా అద్భుతమైన ఆలోచనలు, ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ కొత్త ప్రదర్శనలు.. రాబోయే దశాబ్దాలలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలను సందర్శకులు మరింత లోతుగా, ఇంటరాక్టివ్ పద్ధతిలో అందించేలా డిజైన్ చేయనున్నట్లు మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ చైర్మన్ మహ్మద్ అల్ గెర్గావి గతంలో వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు







