పీసా టవర్పై దాడి చేసేందుకు కుట్ర
- August 13, 2016
ప్రపంచ వింతల్లో ఒకటైన 'లీనింగ్ టవర్ ఆఫ్ పీసా'పై ఉగ్రవాదులు దాడి చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇటలీలోని ప్రఖ్యాత పీసా టవర్కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కట్టడం ఓ పక్కకు ఒరిగి పడిపోకుండా ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇటీవల ఇటలీలో బైలెల్ చియహోయి అనే 26ఏళ్ల ట్యునీషియన్ వ్యక్తి యూరప్లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు పీసా టవర్పై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడైందని అక్కడి మీడియా వెల్లడించింది.ఈ ట్యునీషియన్ దేశస్థుడిని వెంటనే ఇటలీ నుంచి బహిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన పత్రాలపై న్యాయమూర్తి కూడా సంతకం చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ అతడు ఇటలీలో దాడులకు కుట్ర చేశాడనే అంశానికి సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో ఇటలీలో దాడులు జరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటలీ అంతర్గత మంత్రి ఆంజెలినో అల్ఫానో ఆదేశాల మేరకు ట్యునీషియన్ వ్యక్తిని దేశ బహిష్కరణ చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







