దుబాయ్‌ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..

- July 17, 2026 , by Maagulf
దుబాయ్‌ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..

దుబాయ్: దుబాయ్‌కు సంబంధించిన తప్పుడు వార్తలు లేదా ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచురించే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం (Government of Dubai Media Office - GDMO) హెచ్చరించింది.

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో, దుబాయ్ ఎమిరేట్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అమల్లో ఉన్న చట్టాలు, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తప్పుడు సమాచారం ప్రచురించే మీడియా సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మీడియా సంస్థలు, ప్రజలు వార్తలు మరియు సమాచారాన్ని అధికారిక, విశ్వసనీయ వర్గాల నుంచే పొందాలని జీడీఎంఓ సూచించింది. ఏ సమాచారాన్నైనా ప్రచురించే లేదా సోషల్ మీడియాలో పంచుకునే ముందు దాని నిజానిజాలను తప్పనిసరిగా ధృవీకరించాలని కోరింది.

అలాగే పుకార్లు, తప్పుడు వార్తలు, ధృవీకరణ లేని కథనాలను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియా సంస్థలు, ప్రజలకు దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com