ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- July 17, 2026
సలాలా: ఒమన్లోని ధోఫార్ గవర్నరేట్లో పర్యాటకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ (Your Path is Green) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గురువారం అల్ బలీద్ పురావస్తు పార్క్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఖరీఫ్ ధోఫార్–2026 ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అవాసర్ (Awasr) కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా ధోఫార్కు వచ్చే సందర్శకుల్లో పర్యాటక అవగాహన పెంపొందించడం, డిజిటల్ కమ్యూనికేషన్ విధానాలు మరియు స్మార్ట్ మార్గదర్శక సందేశాల ద్వారా ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం, అలాగే పర్యాటకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
హెరిటేజ్, పర్యాటక ప్రాంతాల్లో గైడెడ్ ఫీల్డ్ టూర్లు నిర్వహించడంతో పాటు, సందర్శకులతో ప్రత్యేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన సందేశాలను పరస్పర చర్చల రూపంలో అందించనున్నారు. ఇందుకోసం అవాసర్ కంపెనీ డిజిటల్ మౌలిక సదుపాయాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సలాలా వాలి షేక్ డాక్టర్ సయీద్ బిన్ హుమైద్ అల్ హార్థీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







