ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- July 17, 2026
సలాలా: ఒమన్లోని ధోఫార్ గవర్నరేట్లో పర్యాటకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ (Your Path is Green) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గురువారం అల్ బలీద్ పురావస్తు పార్క్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఖరీఫ్ ధోఫార్–2026 ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అవాసర్ (Awasr) కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా ధోఫార్కు వచ్చే సందర్శకుల్లో పర్యాటక అవగాహన పెంపొందించడం, డిజిటల్ కమ్యూనికేషన్ విధానాలు మరియు స్మార్ట్ మార్గదర్శక సందేశాల ద్వారా ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం, అలాగే పర్యాటకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
హెరిటేజ్, పర్యాటక ప్రాంతాల్లో గైడెడ్ ఫీల్డ్ టూర్లు నిర్వహించడంతో పాటు, సందర్శకులతో ప్రత్యేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన సందేశాలను పరస్పర చర్చల రూపంలో అందించనున్నారు. ఇందుకోసం అవాసర్ కంపెనీ డిజిటల్ మౌలిక సదుపాయాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సలాలా వాలి షేక్ డాక్టర్ సయీద్ బిన్ హుమైద్ అల్ హార్థీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







