ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- July 17, 2026
సలాలా: ఒమన్లోని ధోఫార్ గవర్నరేట్లో పర్యాటకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ (Your Path is Green) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గురువారం అల్ బలీద్ పురావస్తు పార్క్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఖరీఫ్ ధోఫార్–2026 ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అవాసర్ (Awasr) కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా ధోఫార్కు వచ్చే సందర్శకుల్లో పర్యాటక అవగాహన పెంపొందించడం, డిజిటల్ కమ్యూనికేషన్ విధానాలు మరియు స్మార్ట్ మార్గదర్శక సందేశాల ద్వారా ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం, అలాగే పర్యాటకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
హెరిటేజ్, పర్యాటక ప్రాంతాల్లో గైడెడ్ ఫీల్డ్ టూర్లు నిర్వహించడంతో పాటు, సందర్శకులతో ప్రత్యేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన సందేశాలను పరస్పర చర్చల రూపంలో అందించనున్నారు. ఇందుకోసం అవాసర్ కంపెనీ డిజిటల్ మౌలిక సదుపాయాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సలాలా వాలి షేక్ డాక్టర్ సయీద్ బిన్ హుమైద్ అల్ హార్థీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







