విశాఖలో మళ్లీ కరోనా కలకలం..

- July 17, 2026 , by Maagulf
విశాఖలో మళ్లీ కరోనా కలకలం..

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కరోనా వైరస్ కేసు నమోదు కావడం స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని అఫీషియల్ కాలనీకి చెందిన ఒక 33 ఏళ్ల యువకుడికి జరిపిన పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. బాధితుడికి కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో, వైద్యుల సలహా మేరకు అతను ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు.

అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
ఈ కేసు వెలుగుచూడటంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించింది. అధికారులు అప్రమత్తమై బాధితుడి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, సదరు కాలనీ పరిసర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు.

అధికారుల హెచ్చరికలు
కరోనా లేదా జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అనారోగ్యంగా అనిపిస్తే ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు స్వీయ నిర్బంధంలో (Home Isolation) ఉంటూ వైద్యుల సలహాలను పాటించాలని అధికారులు ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com