జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- July 17, 2026
కువైట్ సిటీ: కువైట్లోని జలీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలో 48 గంటల పాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) అధికారులు 315 ఉల్లంఘనలను నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో పాడైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
ప్రభుత్వంలోని సంబంధిత శాఖల సహకారంతో చేపట్టిన ఈ విస్తృత తనిఖీ కార్యక్రమంలో ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్లు, ఇతర ఆహార సంస్థలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆరోగ్య, ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన అనేక సంస్థలపై చర్యలు తీసుకున్నారు.
కువైట్ వ్యాప్తంగా అన్ని గవర్నరేట్లలో ఇలాంటి తనిఖీ కార్యక్రమాలను కొనసాగిస్తామని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తెలిపింది. ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందేలా చూడడమే తమ లక్ష్యమని పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







