జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- July 17, 2026
కువైట్ సిటీ: కువైట్లోని జలీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలో 48 గంటల పాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) అధికారులు 315 ఉల్లంఘనలను నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో పాడైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
ప్రభుత్వంలోని సంబంధిత శాఖల సహకారంతో చేపట్టిన ఈ విస్తృత తనిఖీ కార్యక్రమంలో ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్లు, ఇతర ఆహార సంస్థలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆరోగ్య, ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన అనేక సంస్థలపై చర్యలు తీసుకున్నారు.
కువైట్ వ్యాప్తంగా అన్ని గవర్నరేట్లలో ఇలాంటి తనిఖీ కార్యక్రమాలను కొనసాగిస్తామని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తెలిపింది. ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందేలా చూడడమే తమ లక్ష్యమని పేర్కొంది.
తాజా వార్తలు
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!







