230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- July 17, 2026
దుబాయ్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ గంటకు 230 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపిన ఓ డ్రైవర్ను దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అతడు ఉద్దేశపూర్వకంగా వాహనం నంబర్ ప్లేట్లను తొలగించి రోడ్లపై ప్రయాణించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే దుబాయ్ పోలీసుల సాంకేతిక నిఘా వ్యవస్థల సహాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వాహనాన్ని స్వాధీనం (ఇంపౌండ్) చేసుకుని 50,000 దిర్హామ్ల జరిమానా విధించారు.
ట్రాఫిక్ భద్రతకు ముప్పు కలిగించే విధంగా అతివేగంగా వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లను తొలగించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. రహదారులపై ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







