ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- July 19, 2026
అబుదాబి: మిడిల్ ఈస్ట్ లో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల పై యూఏఈ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా వెంటనే శత్రుత్వ చర్యలను నిలిపివేసి, శాంతి చర్చలను పునఃప్రారంభించాలని యూఏఈ పిలుపునిచ్చింది.
ఈ మేరకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, అన్ని పక్షాలు అత్యంత సంయమనం పాటించాలని, పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యూఏఈ కోరింది. ప్రాంతం మరింత అస్థిరత, హింస వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొంది.
అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానం ఎలాంటి అంతరాయం లేకుండా సురక్షితంగా కొనసాగడం అత్యంత ముఖ్యమని యూఏఈ స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హోర్ముజ్ జలసంధి కీలక మార్గమని పేర్కొంటూ, అక్కడ నౌకాయాన భద్రతను అన్ని దేశాలు పరిరక్షించాలని సూచించింది.
అలాగే ప్రాంతంలోని పౌర మౌలిక సదుపాయాలు, ప్రజలకు సేవలు అందించే సంస్థలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను యూఏఈ తీవ్రంగా ఖండించింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, డీసాలినేషన్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలు, రవాణా కేంద్రాలు, నివాస ప్రాంతాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలు, మానవతా సూత్రాలకు తీవ్రమైన ఉల్లంఘన అని పేర్కొంది.
ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని స్పష్టం చేసిన యూఏఈ, ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు దౌత్యపరమైన చర్చలే ఏకైక మార్గమని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







