అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- July 19, 2026
అబుదాబి: పదేపదే ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో అబుదాబిలోని 'యమ్మీ ఇండియన్ బైట్' (Yummy Indian Bite) రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేయాలని అబుదాబి ఆహార భద్రతా అథారిటీ (ADAFSA) ఆదేశించింది. ఆహార నియంత్రణ తనిఖీ నివేదికలో పదేపదే ఆహార భద్రతా ఉల్లంఘనలు నమోదయ్యాయని, గతంలో పలుమార్లు హెచ్చరించి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా యాజమాన్యం సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని ADAFSA తెలిపింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే పరిపాలనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడటంతో రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, అన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని, నిర్దేశిత ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అధికారుల అనుమతి పొందిన తర్వాతే రెస్టారెంట్ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎమిరేట్లోని అన్ని ఆహార విక్రయ కేంద్రాలు కఠినమైన ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.ఆహార నాణ్యత లేదా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే అబుదాబి ప్రభుత్వ టోల్ఫ్రీ నంబర్ 800555కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ADAFSA విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







