7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- July 26, 2026
మస్కట్: ఒమన్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) తన తనిఖీలను కట్టుదిట్టం చేసింది. జూలై 25తో ముగిసిన వారంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 18 వేలకుపైగా గడువు ముగిసిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకోగా, దాదాపు 54 వేల పొగాకు ఉత్పత్తులు, నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీకెండ్ పనితీరు నివేదికను విడుదల చేసిన సీపీఏ.. వివిధ గవర్నరేట్లలో చేపట్టిన తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, చట్ట అమలు చర్యల వివరాలను వెల్లడించింది.
దోఫార్ ఖరీఫ్ సీజన్ సందర్భంగా వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు "యోర్ అవేర్నెస్.. యోర్ సేఫ్టీ" పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. పర్యాటక సీజన్లో వినియోగదారుల హక్కులు, సురక్షిత కొనుగోళ్లపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని పేర్కొంది.
మస్కట్, అల్ దాఖిలియాహ్ గవర్నరేట్లలో నిర్వహించిన తనిఖీల్లో వ్యాపార సంస్థల నుంచి 18 వేలకుపైగా గడువు ముగిసిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ అల్ షర్కియాహ్, ఉత్తర అల్ బతీనాహ్ గవర్నరేట్లలో దాదాపు 54 వేల పొగాకు ఉత్పత్తులు, నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను జప్తు చేసినట్లు తెలిపింది.
వీటితోపాటు తయారీ లోపాలను గుర్తించిన నేపథ్యంలో 2019–2023 మోడళ్లకు చెందిన 2,266 లెక్సస్ కార్లు, 2022–2025 మోడళ్లకు చెందిన 174 బీఎండబ్ల్యూ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సీపీఏ ప్రకటించింది. ఉత్తర అల్ బతీనాహ్లో వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించి OMR 4,000కుపైగా మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి అందించడంతో పాటు OMR 32,000కు పైగా విలువైన వాహనాన్ని కొత్తదానితో రీప్లేస్ చేయించినట్లు తెలిపింది.
అల్ ధాహిరాహ్, మస్కట్ ప్రాంతాల్లో వినియోగదారుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించిన పలువురు వ్యాపార సంస్థలపై కోర్టులు జరిమానాలు విధించడంతో పాటు, బాధిత వినియోగదారులకు పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు నివేదికలో పేర్కొంది. నియమిత మార్కెట్ తనిఖీలు, కఠిన చట్ట అమలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని సీపీఏ పునరుద్ఘాటించింది. అలాగే, ఎలాంటి ఉల్లంఘనలనైనా తమ అధికారిక కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







