తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- July 30, 2026
తిరుమల: టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ ద్వారా శ్రీవారి భక్తులను మోసగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీటీడీ హెచ్చరించింది. దర్శనం, సేవా టికెట్ల బుకింగ్ పేరుతో భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్ విభాగం.. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
తిరుమల శ్రీవారి భక్తులను లక్ష్యంగా చేసుకుని టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ను రూపొందించి మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దర్శనం, సేవా టికెట్ల బుకింగ్ పేరుతో భక్తుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘TTDDevasthanam.Online’ పేరుతో ఉన్న ఈ నకిలీ వెబ్సైట్లో సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, తోమాల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటి సేవలకు బుకింగ్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నారు. ప్రతి సేవకు ప్రత్యేకంగా ధరలు నిర్ణయించి, వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఒక్కో భక్తి నుంచి రూ.10,500 వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అదనపు లడ్డూలకు ఒక్కోదానికి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది.
టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా కేవలం డొమైన్ పేరులో స్వల్ప మార్పులు చేసి ఈ నకిలీ సైట్ను రూపొందించారని అధికారులు తెలిపారు. ఇందులో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- దక్షిణ ఇరాన్ పై విరుచుకపడ్డ అమెరికా వైమానిక దళం!
- ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026కు గడువు పొడిగింపు..!!
- జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!
- మచిలీపట్నం పేరుతో భారత నౌకాదళ అత్యాధునిక నౌక..ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం
- ఆగస్టు 5 నుంచి ప్లాస్టిక్ క్యాప్లు లేని ఎల్పీజీ సిలిండర్లు.. KNPC







