50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- July 31, 2026
అబుదాబి: యూఏఈలో తీవ్ర ఎండలు కొనసాగుతున్నప్పటికీ, దేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలను మరింత పెంచేందుకు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) క్లౌడ్ సీడింగ్ కార్యక్రమాలను చేపట్టింది. అనుకూలమైన మేఘాలు కనిపించిన ప్రతిసారి గత కొన్ని రోజులుగా క్లౌడ్ సీడింగ్ నిర్వహించినట్లు ఎన్సీఎం వెల్లడించింది. సహజసిద్ధంగా ఏర్పడే వర్షపాతాన్ని మరింత పెంచి, నేలపై పడే వర్షపు చినుకుల పరిమాణాన్ని అధికం చేయడమే క్లౌడ్ సీడింగ్ లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఎన్సీఎం ప్రకారం.. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళల్లో మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలు, అల్ ఐన్ పరిసరాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
50 డిగ్రీల వేడిలో వర్షాలు ఎలా?
ఇటీవలి రోజుల్లో యూఏఈలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఇంతటి వేడిలో వర్షాలు కురవడం అసాధారణంగా కనిపించినప్పటికీ, అధిక ఉష్ణోగ్రతలు నేల వేడిని పెంచి కన్వెక్టివ్ మేఘాలు ఏర్పడేందుకు దోహదపడతాయని వాతావరణ నిపుణులు వివరించారు. అయితే వేడి ఒక్కటే వర్షాలకు కారణం కాదని, తేమతో కూడిన గాలులు, వాతావరణ అస్థిరత, అనుకూల గాలుల దిశ వంటి అంశాలు కలిసి వచ్చినప్పుడే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇటీవల జూలై 29న భారీ వర్షాలు, దుమ్ము తుఫాన్లు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచిన నేపథ్యంలో ఎన్సీఎం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతకుముందు మసాఫీ, అల్ ఐన్ ఉత్తర ప్రాంతాల్లో వర్షాలతో పాటు వడగళ్ల వాన కూడా నమోదైంది. అలాగే జూలై 28న దేశంలోని పలు ప్రాంతాలకు వర్షాలు, దుమ్ము తుఫాన్ల హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..
- రేపే ఏపీకి ప్రధాని మోదీ..
- సెర్బియా పర్యటన ముగించుకుని యూఏఈ అధ్యక్షుడు స్వదేశానికి తిరుగు ప్రయాణం
- మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!







