వరుస పేలుళ్లు అసోంలో..
- August 15, 2016
ఓవైపు రాష్ట్రమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటుంటే.. మరోవైపు అసోంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉల్ఫా-ఇండిపెండెంట్ మిలిటెంట్లు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.
తొలుత ఉదయం 7.15 గంటల ప్రాంతంలో లయ్పులిలోని ఇందిరాగాంధీ స్కూల్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఇది జరిగిన కొద్ది నిమిషాలకే.. దూందుమా ప్రాంతంలోని ఓ టీ ఎస్టేట్, మసువా ప్రాంతంలో వెంటవెంటనే బాంబులు పేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత కొద్ది సేపటికే ఫిలోబరి ప్రాంతంలో మరోసారి పేలుడు సంభవించింది. వరుస పేలుళ్లతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎక్కడా ఎవరూ గాయపడనట్లు సమాచారం లేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







