ప్రయాణాలకు వెళ్లే ముందు విద్యుత్ పరికరాలు ఆఫ్ చేస్తున్నారా..!!
- August 03, 2026
కువైట్: ప్రయాణాలకు వెళ్లే ముందు ఇళ్లలో విద్యుత్, నీటి వినియోగాన్ని తగ్గించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కువైట్ విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. జాతీయ వనరుల పరిరక్షణతో పాటు విద్యుత్, నీటి వృథాను అరికట్టే లక్ష్యంతో నిర్వహిస్తున్న "సేవ్ (Save)" అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ సూచనలు జారీ చేసింది.
సెలవుల సమయంలో కుటుంబాలు ఇళ్లకు దూరంగా ఉండే నేపథ్యంలో ఇంటి నుంచి బయలుదేరే ముందు అవసరం లేని విద్యుత్ పరికరాలను ప్లగ్ల నుంచి తొలగించాలని సూచించింది. అలాగే అన్ని లైట్లు ఆఫ్ చేయడం, ఎయిర్ కండీషనర్ను 27 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేయడం లేదా అవసరం లేకపోతే పూర్తిగా ఆఫ్ చేయడం, వాటర్ హీటర్ను నిలిపివేయడం, ఇంట్లోని నీటి పైపుల్లో లీకేజీలు ఉన్నాయో లేదో పరిశీలించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఈ జాగ్రత్తలతో విద్యుత్, నీటి వినియోగం తగ్గడమే కాకుండా విద్యుత్ బిల్లులు తగ్గుతాయని, ఇల్లు ఖాళీగా ఉన్న సమయంలో భద్రత కూడా మెరుగుపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా జాతీయ వనరుల పరిరక్షణకు తోడ్పడటంతో పాటు కువైట్ విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా ఇవి దోహదపడతాయని వెల్లడించింది. ప్రజల్లో బాధ్యతాయుత వినియోగంపై అవగాహన కల్పించే "సేవ్" ప్రచారాన్ని కొనసాగిస్తామని, విద్యుత్, నీటి వంటి విలువైన జాతీయ వనరులను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి
- మెట్రాష్ యాప్తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!
- భారత్ లో ఒక్కో యూజర్ నెలకు 50 గంటలు ఇన్స్టాలోనే!
- సెప్టెంబర్లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!







