అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!

- August 03, 2026 , by Maagulf
అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!

ప్రపంచ క్రీడా లోకం ఎంతో ఉత్కంఠగా తిలకించిన కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలు అట్టహాసంగా, వర్ణరంజితంగా ముగిశాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమైన ఈ ముగింపు వేడుకలలో భారతీయ సంస్కృతి, కళల మేళవింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ విశ్వసుందరి మానుషీ చిల్లార్ రమణీయ నృత్య ప్రదర్శనలు, ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన దేశభక్తి గీతాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ప్రిన్స్ ఎడ్వర్డ్ అధికారిక ప్రసంగం అనంతరం క్రీడల ముగింపును ప్రకటించారు. ఈ వేడుకల్లో భారత కామన్వెల్త్ క్రీడా బృందానికి పతక విజేత, మహిళా బాక్సర్ జాస్మిన్ లంబోరియా ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించి త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ముందుకు నడిపించారు.

అహ్మదాబాద్‌కు ఆతిథ్య హక్కులు: జెండాను స్వీకరించిన నీరజ్ చోప్రా, పీటీ ఉష

ఈ ముగింపు వేడుకల్లో భారతదేశానికి అత్యంత కీలకమైన, గర్వకారణమైన ఘట్టం చోటుచేసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని అధికారికంగా ప్రకటిస్తూ ఒక ప్రత్యేక ప్రోమో వీడియోను ప్రదర్శించారు. కామన్వెల్త్ క్రీడల అధికారిక జెండాను భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష మరియు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సగౌరవంగా అందుకున్నారు. భారత్ వేదికగా తదుపరి కామన్వెల్త్ క్రీడలు జరగనుండటంతో దేశీయ క్రీడారంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని క్రీడా విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com