కాశ్మీర్ అంశంపై చర్చలకు భారత్ను ఆహ్వానించిన పాక్
- August 15, 2016
వివాదాస్పద కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ మరోసారి లేవనెత్తింది. కశ్మీర్ అంశంపై చర్చించేందుకు భారత్ను ఆహ్వానించింది. ఈ మేరకు పాక్ విదేశీ కార్యాలయం అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా పాక్లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబ్వాలేకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈసారి జరిగే ద్వైపాక్షిక చర్చలు కశ్మీర్ ప్రధాన ఎజెండాగా సాగాలని కోరారు. సమకాలీన అంశాలను పక్కన పెట్టి ఇరు దేశాలకు చెందిన కశ్మీర్ సమస్యపై చర్చించాలని కోరారు.
కాగా, ద్వైపాక్షిక చర్చల పట్ల భారత్ సానుకూలంగానే ఉన్నప్పటికీ అవి సమకాలీన అంశాలకు సంబంధించినవే ఉండాలన్నది భారత్ వాదన. ఉగ్రవాదుల చొరబాట్లు, సరిహద్దు ఉగ్రవాదం వంటి అంశాలపైనే ఈ చర్చలు సాగాలన్నది భారత వైఖరి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









