రేపు రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు

- July 28, 2015 , by Maagulf
రేపు రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ మృతిపట్ల కేంద్ర కేబినెట్‌ సంతాపం వ్యక్తం చేసింది. కలాం సేవలను కొనియాడుతూ కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. రేపు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరగనున్నట్లు కేబినెట్ తెలిపింది. కలాం మృతికి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని రాజాజీమార్గ్‌లో ఈరోజు మధ్యాహ్నం నుంచి కలాం పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తరువాత భౌతికకాయాన్ని ఆయన జన్మస్థలం రామేశ్వరానికి తరలిస్తామని కేంద్రమంత్రి రూడీ తెలిపారు. అంతకుముందు బీజేపీ పార్లమెంట్‌ సమావేశంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలాం మరణంతో భారతదేశం తన రత్నాన్ని కోల్పోయిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అబ్దుల్‌ కలాం ముందు దేశానికి భారతరత్నమని ఆ తరువాతే రాష్ట్రపతి అయ్యారని ప్రధాని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com