ఒలింపిక్స్ మైదానాల్లో కార్చిచ్చు కలకలం..
- August 15, 2016
ఒలింపిక్స్ మైదానాల్లో కార్చిచ్చు కలకలం రేపింది. ఒలింపిక్ హాకీ మైదానంలోకి కార్చిచ్చు బూడిద వ్యాపించడంతో అక్కడే ఉన్న అథ్లెట్లను, బీఎంఎక్స్ కేంద్రాన్ని ఖాళీ చేయించారు. సోమవారం మధ్యాహ్నం రియోలో ఉష్ణోగ్రత భారీగా పెరగటంతో కార్చిచ్చు ఏర్పడింది. దీంతో హాకీ మైదానం, ఎక్స్పార్క్, ది కెనోయి స్లాలోమ్, బీఎంఎక్స్, మౌంటేన్ బైకింగ్ ఈవెంట్లు జరిగే ప్రదేశాలను ఖాళీ చేయించారు.అగ్నికి ఆజ్యం పోసినట్లు దీనికి గాలికూడా తోడవడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. గాలుల కారణంగా ఒలింపిక్ పార్క్లో కెమెరా కూలిపోయిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.ఫీల్డ్హాకీ స్టేడియంలో బూడిద పడుతున్న సమయంలో అమెరికా జర్మనీ జట్లమధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో అమెరికా విజయం సాధించింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









