సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- August 15, 2026
న్యూ ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటీష్ వలస పాలనకు ముగింపు పలికి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన ఘనంగా స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలు, స్ఫూర్తితో సమైక్య మరియు సమర్థవంతమైన భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు. నేడు 140 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం, నిరంతర శ్రమతో దేశం అన్ని రంగాల్లోనూ ప్రగతి శిఖరాలను అధిరోహిస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే విజయోత్సవ ప్రయాణం ఇలాగే వేగవంతంగా ముందుకు సాగాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి ఘన నివాళి..ప్రతిధ్వనించిన ‘రఘుపతి రాఘవ’
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఆరంభంలో ప్రధాని మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ను దర్శించి, జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్ముడు చూపిన అహింసా మార్గాన్ని, చేసిన అమూల్యమైన త్యాగాలను మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రధాని నివాళులర్పిస్తున్న సమయంలో రాజ్ ఘాట్ ప్రాంగణంలో ఆత్మీయంగా ప్రతిధ్వనించిన ‘రఘుపతి రాఘవ రాజారామ్’ సంకీర్తన వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా, భావోద్వేగభరితంగా మార్చింది.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







