టర్కీలో పేలుడు, ఆరుగురు మృతి

- August 18, 2016 , by Maagulf
టర్కీలో పేలుడు, ఆరుగురు మృతి

టర్కీలో కారు బాంబు పేలుడుతో ఆరుగురు​ మరణించగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు. టర్కీ తూర్పు ప్రాంతంలోని వాన్‌ సిటీలో కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీ మిలిటెంట్లు దాడికి తెగబడ్డట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బాంబులతో ఉన్న కారును పేల్చడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ లక్ష్యంగా మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com