నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- August 29, 2026
జెడ్డా: నేపాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సౌదీ అరేబియా రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్కు వారు వేర్వేరుగా సంతాప సందేశాలు పంపారు.
ఈ విపత్తులో మరణించిన వారి కుటుంబ సభ్యులతో పాటు నేపాల్ ప్రజలకు రాజు సల్మాన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గల్లంతైన వారు క్షేమంగా తమ కుటుంబాల వద్దకు తిరిగి చేరుకోవాలని ఆకాంక్షించారు. నేపాల్పై మరింత విపత్తు ప్రభావం పడకుండా ఉండాలని ప్రార్థించారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా అధ్యక్షుడు పౌడెల్, మృతుల కుటుంబాలు, నేపాల్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గల్లంతైన వారంతా సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
నేపాల్తో పాటు పొరుగున ఉన్న చైనాలోనూ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మీడియా కథనాలు, స్థానిక అధికారుల సమాచారం ప్రకారం రెండు దేశాల్లో కలిపి 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 3,000 మంది వరకు ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం.
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







