యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- August 30, 2026
దుబాయ్: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ను దుబాయ్లోని అల్ మార్మూమ్లో కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు. దేశ వ్యవహారాలు, పౌరుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాల పై సమీక్ష నిర్వహించారు. యూఏఈ అభివృద్ధి ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న చర్యల పై కూడా చర్చించారు.
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, వారికి మరింత సుసంపన్నమైన, స్థిరమైన భవిష్యత్తును అందించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశంలో యూఏఈ అధ్యక్షుడి సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







