యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ

- August 30, 2026 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ

దుబాయ్: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ను దుబాయ్‌లోని అల్ మార్మూమ్‌లో కలిశారు.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు. దేశ వ్యవహారాలు, పౌరుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాల పై సమీక్ష నిర్వహించారు. యూఏఈ అభివృద్ధి ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న చర్యల పై కూడా చర్చించారు.

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, వారికి మరింత సుసంపన్నమైన, స్థిరమైన భవిష్యత్తును అందించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సమావేశంలో యూఏఈ అధ్యక్షుడి సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com