రైజింగ్ స్టార్ సింధు మెగాఫైనల్కు సిద్ధo..
- August 19, 2016
రైజింగ్ స్టార్ సింధు మెగాఫైనల్కు సిద్ధమైంది. వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్తో తెలుగుతేజం తలపడనుంది. రియోలో గోల్డ్మెడల్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించాలనుకుంటోంది సింధు. రియో ఒలింపిక్స్లో తెలుగుతేజం సింధు అంచనాలు అందుకుంటోంది. ఉమెన్స్ సింగిల్స్లో వరుస విజయాలతో ఫైనల్ చేసింది. గోల్డ్మెడల్కు విజయం దూరంలో ఉంది. ఫైనల్లో స్పెయిన్ షెట్లర్ కరోలినా మారిన్తో సింధు తలపడబోతోంది.
ఒలింపిక్స్ ఆరంభం నుంచి దూకుడు మీదున్న తెలుగు రాకెట్ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. సూపర్ ఫామ్తో వరల్డ్ నెంబర్వన్కు షాకివ్వాలనుకుంటోంది. ఒలింపిక్స్లో తొలిసారి బరిలో దిగిన సింధు ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. తుదిపోరులోనూ ఏ మాత్రం ఒత్తిడికి లోనవకుండా కూల్గా ఆడాలని ప్లాన్ చేసుకుంది.
రికార్డులు మాత్రం మారిన్కు ఫేవర్గా ఉన్నాయి. ఇద్దరూ ఏడుసార్లు ఫేస్ టు ఫేస్ తలబడ్డారు. ఇందులో సింధు మూడు మ్యాచుల్లో గెలువగా మారిన్ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ప్రస్తుతం సింధు పదో ర్యాంక్లో ఉండగా మారిన్ టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది.
బ్యాట్మింటన్ ఎరినాలో కరోలినా పేరు మారుమోగుతోంది. లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ అయిన మారిన్ వరుస టైటిల్స్తో తనదైన ముద్ర వేస్తోంది. చైనా సవాల్ను అధిగమించి మెగా ఈవెంట్లో ఫైనల్ చేరింది. స్వర్ణం సాధించి అసలైన ఛాంపియన్గా నిలవాలనుకుంటోంది.
ఆత్మవిశ్వాసంతో ఆడాలని సింధు వ్యూహాలు సిద్ధం చేసుకుంది. సెమీస్ ఆటతీరును ఫైనల్స్లో రిపీట్ చేయాలనుకుంటోంది. భారత అభిమానులకు గోల్డ్ మెడల్ అందించాలనే పట్టదలతో కనిపిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







