బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది నేడు ..
- August 19, 2016
ఈరోజు బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.31,250కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గినప్పటికీ దేశీయంగా డిమాండ్ ఎక్కువగానే ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతూనే ఉండడంతో బంగారం ధర పెరుగుతోంది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.5శాతం తగ్గి 1,345.80 అమెరికా డాలర్లకు చేరింది.డిమాండ్ లేమితో నేడు వెండి ధర తగ్గింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ.185 తగ్గి రూ.46,465కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర పడిపోయినట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









