రాజధాని అ మరావతిలో ప్లాస్టిక్‌ పార్క్‌...

- August 19, 2016 , by Maagulf
రాజధాని అ మరావతిలో ప్లాస్టిక్‌ పార్క్‌...

రాజధాని అ మరావతిలో ప్లాస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. శుక్రవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విశాఖపట్టణంలో ఏర్పాటుచేస్తున్న మెడి టెక్ పార్క్‌తో 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేసేలా మెడి టెక్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఈ మెడి టెక్‌ పార్క్‌లో 300 కంపెనీలు ఏర్పాటుకానున్నాయని, మొత్తం రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com