36 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఇరాక్ లో ఉరితీత...
- August 21, 2016
36 మంది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను ఇరాక్ ఆదివారం ఉరితీసింది. 2014లో సున్నీ జిహాదీలు, సంకీర్ణ తీవ్రవాదులు కలిసి టిక్రిట్ నగరంలోని ఆర్మీ స్థావరంపై దాడిచేసి వందలాదిమందిని ఊచకోత కోశారు. 17 వందల మంది ఆర్మీ రిక్రూటర్లను అపహరించిన ఉగ్రవాదులు వారిలో 300 మందిని అతి దారుణంగా చంపేశారు. స్పీచర్ నరమేధంగా పిలిచే కేసులో 36 మందిని దోషులుగా తేల్చిన కోర్టు గతేడాది మరణశిక్ష విధించింది. నసిరియా కారాగారంలో ఆదివారం వీరికి మరణశిక్ష అమలు చేసినట్టు ధిఖార్లోని గవర్నర్ కార్యాలయం తెలిపింది. మరణిశిక్షను తిలకించేందుకు బాధిత బంధువులు చాలామంది జైలుకు చేరుకున్నారు. ఉగ్రవాదులను ఉరితీస్తున్నప్పుడు సంతోషంతో 'అల్లాహు అక్బర్' అని పెద్ద ఎత్తున నినదించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







