పాకిస్థాన్లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- September 19, 2026
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పోలీస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన పేలుడు, తుపాకీ దాడిలో మృతుల సంఖ్య 31కి చేరింది. ఈ దాడిలో 16 మంది పోలీసు సిబ్బంది సహా కనీసం 31 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని సుమారు 2.2 లక్షల జనాభా ఉన్న కోహాట్ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
పేలుడు పదార్థాలతో కారును ఢీకొట్టిన దుండగులు
అధికారుల ప్రకారం, దుండగులు ఓల్డ్ పోలీస్ లైన్స్ కాంప్లెక్స్లోకి చొరబడ్డారు. పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులు మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలతో నింపిన కారును పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం దుండగులు కాల్పులకు పాల్పడటంతో భద్రతా బలగాలు, దాడి చేసిన వారి మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి.
దాడికి బాధ్యత ప్రకటించిన ఉగ్రవాద సంస్థ
ఈ దాడికి స్థానిక మిలిటెంట్ సంస్థ ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్థాన్ బాధ్యత వహించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), పాకిస్థాన్ తాలిబాన్తో సంబంధం ఉన్న వర్గంగా అధికారులు పేర్కొన్నారు.
దాడి అనంతరం ఘటనాస్థలంలో భద్రతా బలగాల చర్యలు కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!
- మస్కట్లో ఈ-బైక్ ల వినియోగానికి ప్రోత్సాహం..!!
- ప్రపంచ సముద్ర రవాణాకు పెరుగుతున్న ముప్పులు..!!
- ఖతార్లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గాయి
- కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- పాకిస్థాన్లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- షార్జాలో వాహనదారులకు సులభతర సేవలు..కొత్త కార్యక్రమం ప్రారంభం
- నేపాల్కు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్







