ప్రపంచ సముద్ర రవాణాకు పెరుగుతున్న ముప్పులు..!!
- September 19, 2026
మనామా: ప్రపంచవ్యాప్తంగా కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న అంతరాయాల నేపథ్యంలో సముద్ర రవాణా భద్రత, నౌకాయాన స్వేచ్ఛను కాపాడేందుకు మరిన్ని ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని బహ్రెయిన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరింది. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ న్యూయార్క్లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో బహ్రెయిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించారు.
హోర్ముజ్ జలసంధి, బాబ్ అల్-మందెబ్, ఎర్ర సముద్రం ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. హోర్ముజ్ జలసంధి మూసివేత, సముద్ర రవాణాకు ఏర్పడిన అంతరాయాలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయని సమావేశంలో చర్చించారు.
సముద్ర మార్గాలకు ఎదురయ్యే ముప్పులను గుర్తించడం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో భారీ అంతరాయాలను నివారించడం, ముందస్తు సిద్ధత, అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం, తిరిగి సాధారణ పరిస్థితులకు తీసుకురావడం వంటి అంశాల్లో అంతర్జాతీయ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో 50 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే వస్తువుల్లో 80 శాతానికి పైగా సముద్ర మార్గం ద్వారానే తరలుతున్నాయని సమావేశంలో వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి ప్రపంచ సముద్ర మార్గం ద్వారా జరిగే చమురు వాణిజ్యంలో సుమారు 25 శాతం, అలాగే లిక్విడ్ సహజ వాయువు (LNG) వాణిజ్యంలో 19 శాతం వాటాను కలిగి ఉంది. సంఘర్షణ మొదటి నెలలో జరిగిన ఆర్థిక నష్టం సుమారు USD 150 బిలియన్లుగా అంచనా వేసింది. ఇది ప్రాంతీయ GDPలో దాదాపు 4 శాతంకు సమానమని తెలిపింది.
నౌకాయాన స్వేచ్ఛకు మద్దతు
యూఎన్ భద్రతా మండలిలో అల్ జయానీ మాట్లాడుతూ.. సముద్ర మార్గాల భద్రత, నౌకాయాన స్వేచ్ఛను పెంపొందించడంలో బహ్రెయిన్ తన పాత్రను కొనసాగిస్తుందని తెలిపారు. సముద్ర భద్రతను ఉమ్మడి బాధ్యతగా భావించే దేశాలతో కలిసి పనిచేయడానికి బహ్రెయిన్ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!
- మస్కట్లో ఈ-బైక్ ల వినియోగానికి ప్రోత్సాహం..!!
- ప్రపంచ సముద్ర రవాణాకు పెరుగుతున్న ముప్పులు..!!
- ఖతార్లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గాయి
- కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- పాకిస్థాన్లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- షార్జాలో వాహనదారులకు సులభతర సేవలు..కొత్త కార్యక్రమం ప్రారంభం
- నేపాల్కు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్







