30 శాతం అగ్ని ప్రమాదాలకు 4 నిమిషాల్లోనే స్పందన
- August 21, 2016
30 శాతం అగ్ని ప్రమాదాల విషయంలో దుబాయ్ సివిల్ డిఫెన్స్ కేవలం 4 నిమిషాల్లోనే స్పందించి, అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ రషీద్ తని అల్ మత్రౌషి మాట్లాడుతూ, 90 శాతం అగ్ని ప్రమాదాల విషయంలో 6 నుంచి 8 నిమిషాల్లోనే స్పందించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుందని అన్నారు. అల్ హామ్రియా ఫైర్ స్టేషన్ని సందర్శించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. పబ్లిక్ కూడా సివిల్ డిఫెన్స్కి సహకరించాలనీ, అగ్ని ప్రమాదాల్లో పబ్లిక్ పాత్ర ఎంతో కీలకమని ఆయన వివరించారు. ప్రమాదం గురించి సమగ్ర సమాచారం అందించగలిగితే, పరిస్థితిపై ఓ అవగాహన ఏర్పాటుచేసుకుని, తగిన రీతిలో స్పందించడానికి వీలవుతుందని అల్ హామ్రియా చెప్పారు. అత్యవసర సమయాల్లో వాహనదారులు, ఫైర్ ట్రక్స్కి దారి విడిచిపెట్టడం ద్వారా ప్రమాద స్థలికి తొందరగా చేరుకోగలుగుతామన్నారు అల్ హమ్రియా. అంతర్జాతీయ ప్రమాణాలతో దుబాయ్ సివిల్ డిఫెన్స్ పనిచేస్తోందనీ, ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ అల్ హామ్రియా వివరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







