గాల్లో రివ్వున దూసుకెళ్లే ట్యాక్సీలు..
- August 22, 2016
ఇప్పటికే గూగుల్.. ఉబర్.. ఐబీఎం.. టెస్లా వంటి దిగ్గజ సంస్థలు స్వయం నియంత్రిత వాహనాల తయారీలో తలమునకలై ఉన్నాయి. డ్రైవర్లెస్ కార్లను.. బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చి పరీక్షిస్తున్నాయి. అలాగే త్వరలో గాల్లో రివ్వున దూసుకెళ్లే స్వయం నియంత్రిత ట్యాక్సీలు కూడా రాబోతున్నాయి. అందుకోసం ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ కసరత్తులు ముమ్మరం చేసింది. నగరాల్లో ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్తో పనిచేసే 'అటానమస్ ఫ్లైయింగ్ ట్యాక్సీ'లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్బస్ ప్రకటించింది. .డ్రోన్ల మాదిరిగా ఉండే ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీలకు 'సిటీ ఎయిర్బస్' అని పేరు పెట్టారు.ఇవి ప్రయాణికులతోపాటు.. సరుకు రవాణాకు కూడా ఉపయోగపడతాయట. స్మార్ట్ఫోన్ సాయంతో ఇచ్చే కమాండ్తో ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఎక్కడికంటే అక్కడికి ఎగిరి వెళ్లిపోతుందట. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వీటి తయారీని ప్రారంభించిన ఎయిర్బస్.. తొలి డిజైన్ను 2017లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు తెలిపింది.గాల్లో ఎగిరేటప్పుడు దానంతట అదే ఎయిర్ ట్రాఫిక్ను గుర్తించే వ్యవస్థను సవాల్గా తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ చెబుతోంది. మరో పదేళ్లలో పూర్తి స్థాయి ఫ్లైయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.వీటితోనైనా నగరాల్లో ట్రాఫిక్ సమస్య నుంచి కాసింత ఉపశమనం దొరికే అవకాశం ఉంటుందేమో.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







