పేద యుఎఇ విద్యార్థుల విద్యకు 200,000 డి హెచ్ కేటాయింపు

- August 23, 2016 , by Maagulf
పేద  యుఎఇ విద్యార్థుల విద్యకు 200,000 డి హెచ్ కేటాయింపు

తక్కువ ఆదాయం కలిగిన నిరుపేద కుటుంబాల  విద్యార్థులకు సహాయం  అందించడానికి , ఆర్ధిక సమస్యల ఒత్తిడి భారంతో సతమతమవుతున్న తల్లిదండ్రుల దురవస్థ తగ్గించడానికి ఒకాఫ్ మరియు మైనర్ల వ్యవహారాల ఫౌండేషన్ (ఎ ఎం ఎ ఎఫ్ ) వారు  నేషనల్ ఛారిటీ పాఠశాలలకు 200,000 డి హెచ్  విరాళమిచ్చారు.ఎ ఎం ఎ ఎఫ్  వద్ద ఎండోమెంట్ వే అవుట్స్ విభాగం ముఖ్యఅధిపతి  ఫాహ్డ్ అల్ బాన్నై  , గతవారం లో దుబాయ్ లోని  ఒకాఫ్ మరియు మైనర్ల వ్యవహారాల ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం వద్ద నేషనల్ ఛారిటీ స్కూల్స్ జనరల్ మేనేజర్ డాక్టర్ కమల్ ఫర్హత్ కు ఆ మొత్తం  చెక్ ను  అందజేశారు.ఎ ఎం ఎ ఎఫ్   వివిధ రంగాల పురోభివృద్ధికి ఐదు దేవాదాయ ఖాతాలు ఉన్నాయి. వీటిలో - సోషల్ ఎఫైర్స్, ఆరోగ్యం, విద్య, ఇస్లామిక్ అఫైర్స్, దైవభక్తి మరియు ధర్మానికి వినియోగిస్తాయారు..2016 లో, దేవాదాయ బడ్జెట్ లో  చదువు కోసం  200,000 డి హెచ్  ప్రస్తుతం నేషనల్ ఛారిటీ పాఠశాలలు కోసం 700,000 డి హెచ్  కేయాయింపు జరిగింది  మేము నేషనల్ ఛారిటీ పాఠశాలలు ట్యూషన్ ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న  విద్యార్థులకు   నాణ్యమైన విద్యని అందించడానికి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ , వారికి ఇవ్వనున్న మద్దతు గూర్చి  సంతోషిస్తున్నారు ఈ విరాళం విధానంలో మా సంకల్పం తో తక్కువ నిమ్న పిల్లలకు ఈ సహాయం ఎంతో  విలువైనది  వారి సంరక్షణ మా బాధ్యతగా ఉంది. ఇందులో  మానవత మా  లక్ష్యంగా ఉందని "ఫాహ్డ్ అల్ బాన్నై తెలిపారు.

  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com