గ్యాస్ పేలుడులో బామ్మ మృతి... 3 నెలల పసిపాప క్షేమం
- August 25, 2016
దుబాయ్: స్థానిక అల్ ఖైల్ గేట్ ప్రాంతంలో బుధవారం ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 63 ఏళ్ళ షిరిన్ గాంధీ గురువారం ఉదయం రషీద్ హాస్పిటల్ ఐ సి యు వద్ద ఆమె తుది శ్వాస విడిచారని ఒక కుటుంబ సభ్యుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు..గాయాల పాలైన మరో బాధితురాలి భర్త హుస్సేన్ లక్డావాలా మాట్లాడుతూ ,బుధవారం ఉదయం 9.20 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు "నా అత్తగారు ఈ ప్రమాదంలో 60 శాతం కాలిన గాయాలతో ప్రాణం విడిచారు . రెండవ బాధితురాలు అయిన తన భార్య 50 శాతం గాయాలతో చావుబతుకుల మధ్య రషీద్ హాస్పిటల్ ఐ సి యు లో పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.తన భార్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది మరియు ఆమె స్పృహలో ఉందని ఆమె తిరిగి కోలుకుంటుందని మేము విశ్వసిస్తున్నట్లు 'లక్డావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ చెక్కుచెదరకుండా కనుగొనబడింది. గ్యాస్ లీక్ కారణంగా ఈ ప్రమాదం ఏర్పడి ఉండవచ్చుని భావిస్తున్నారు.అల్ ఖైల్ గేట్ ఫ్లాట్ లోపలి భాగం పూర్తిగా పగుళ్లు బారి ధ్యంసం కాబడింది. లక్డావాలా మాట్లాడుతూ , ఈ ప్రమాద సమయంలో తమ మూడు నెలల వయస్సు ఉన్నకుమార్తె, జరా ఆమె తల్లి తో ఉందని ఒక అద్భుతమైన రీతిలో చిన్న గాయాలతో ప్రమాదం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.నా ముద్దుల కూతురు జరా, ప్రస్తుతం లాటీఫా హాస్పిటల్ లో దేవుని దయ ద్వారా సురక్షితమైన పరిస్థితిలో ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









