రష్ అవర్లో ట్రక్కులపై నిషేధం
- August 25, 2016
ట్రక్కులు మరియు కార్మికుల్ని తరలించడానికి ఉపయోగించే 50 సీట్లు కలిగిన ప్యాసింజర్ బస్సులు అబుదాబీ ఐలాండ్ ఇంటర్నల్ రోడ్స్లోకి ఇకపై రష్ అవర్లో అనుమతించబడవు. ఉదయం 6.30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని అబుదాబీ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. రహదారులపై మరింత భద్రత కోసం ఈ చర్య తీసుకున్నట్లు అబుదాబీ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ అలి ఖల్ఫాన్ అల్ దహెరి చెప్పారు. ఈ నిషేధంతో స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఎలాంటి సమస్యలూ లేకుండా స్కూల్స్కి చేరుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







