రష్ అవర్లో ట్రక్కులపై నిషేధం
- August 25, 2016
ట్రక్కులు మరియు కార్మికుల్ని తరలించడానికి ఉపయోగించే 50 సీట్లు కలిగిన ప్యాసింజర్ బస్సులు అబుదాబీ ఐలాండ్ ఇంటర్నల్ రోడ్స్లోకి ఇకపై రష్ అవర్లో అనుమతించబడవు. ఉదయం 6.30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని అబుదాబీ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. రహదారులపై మరింత భద్రత కోసం ఈ చర్య తీసుకున్నట్లు అబుదాబీ పోలీస్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ అలి ఖల్ఫాన్ అల్ దహెరి చెప్పారు. ఈ నిషేధంతో స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఎలాంటి సమస్యలూ లేకుండా స్కూల్స్కి చేరుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







