కాఠ్‌మాండూ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం

- August 25, 2016 , by Maagulf
కాఠ్‌మాండూ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం

నేపాల్‌లోని కాఠ్‌మాండూ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కాఠ్‌మాండూకు 120 కిలోమీటర్ల దూరంలోని చందిభంజ్యాంగ్‌ ప్రాంతంలో అదుపుతప్పి త్రిశోలి నదిలో పడిపోయింది. బస్సు దాదాపు నీటిలో మునిగిపోవడంతో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 17 మంది గాయాలతో బయటపడ్డారు. పోలీసులు సహా గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
మృత దేహాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com