డేటా యూజర్లకు పండగే పండగ....

- August 27, 2016 , by Maagulf
డేటా యూజర్లకు పండగే పండగ....

డేటా యూజర్లకు పండగే పండగ. టెలికాం కంపెనీలు యుద్ధం చేస్తున్నాయి. 4జీ టెక్నాలజీ సబ్‌స్క్రైబర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాయి. పోటాపోటీగా డేటా రేట్లు తగ్గిస్తున్నాయి. కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించేందుకు తాజాగా ఎయిర్‌టెల్ సంచలనాత్మక ఆఫర్‌ను ప్రకటించింది. రూ 250కే 10 జీబీ డేటా ఇస్తామని పేర్కొంది. జే సిరీస్ స్యామ్‌సంగ్ ఫోన్‌ను కొనేవాళ్ళకు 1 జీబీ ధరకే 10 జీబీ 4జీ డేటాను ఇస్తామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న ఎయిర్‌టెల్ యూజర్లు, కాబోయే యూజర్లు కూడా వినియోగించుకోవచ్చునని తెలిపింది. 4జీ అందుబాటులో లేని ప్రాంతాల్లో 3జీ డేటా పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com