మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూ హితిన్ క్యాతో భేటీ
- August 29, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూ హితిన్ క్యాతో భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో మోదీ, క్యా సమావేశమై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మయన్మార్లో ప్రముఖ ఉద్యమకారిణి అంగ్శాన్ సూచీకి చెందిన నేషనల్ లీగ్ పార్టీ చారిత్రక విజయం సొంతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి భారత్, మయన్మార్ల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, వాణిజ్యం పెట్టుబడుల రంగానికి సంబంధించి, మయన్మార్ 1600కి.మీ.ల సరిహద్దు రక్షణ గురించి... తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హితిన్ క్యా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇదే తొలి విదేశీ పర్యటన.సతీమణితో కలిసి వచ్చిన హితిన్ క్యా నిన్న గయలో మహాబోధి ఆలయాన్ని, ఈరోజు ఉదయం ఆగ్రాకు వెళ్లి తాజ్మహల్ను సందర్శించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







