మోదీ ఈరోజు మయన్మార్‌ అధ్యక్షుడు యూ హితిన్‌ క్యాతో భేటీ

- August 29, 2016 , by Maagulf
మోదీ ఈరోజు మయన్మార్‌ అధ్యక్షుడు యూ హితిన్‌ క్యాతో భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్‌ అధ్యక్షుడు యూ హితిన్‌ క్యాతో భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ, క్యా సమావేశమై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మయన్మార్‌లో ప్రముఖ ఉద్యమకారిణి అంగ్‌శాన్‌ సూచీకి చెందిన నేషనల్‌ లీగ్‌ పార్టీ చారిత్రక విజయం సొంతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి భారత్‌, మయన్మార్‌ల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, వాణిజ్యం పెట్టుబడుల రంగానికి సంబంధించి, మయన్మార్‌ 1600కి.మీ.ల సరిహద్దు రక్షణ గురించి... తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హితిన్‌ క్యా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇదే తొలి విదేశీ పర్యటన.సతీమణితో కలిసి వచ్చిన హితిన్‌ క్యా నిన్న గయలో మహాబోధి ఆలయాన్ని, ఈరోజు ఉదయం ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్‌ను సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com